నూతన సంవత్సర శుభాకాంక్షలు

కొత్త ఆకాంక్షలు… ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతం అందించిన అనుభవాలతో కొత్త యేడాదిలో ముందుకు సాగాలి. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకొనే నిర్ణయం రాష్ట్ర పురోగతికి మేలు మలుపు కావాలి. ప్రజా నిర్ణయం కచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, శాంతిభద్రతలపై ప్రభావం చూపిస్తుంది. 2024 సంవత్సరం అందరిలో కొత్త ఉత్సాహాన్నీ, సుఖ సంతోషాలను అందించాలని కోరుకొంటున్నానని జనసేనాని తెలిపారు.