ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం: డా. యుగంధర్ పొన్న

  • కార్తీక్ కి మెరుగైన వైద్యం అందించాలి
  • జబ్బు నయమయ్యేఒత వరకు జవాబుదారి ఉండాలి.. అదీ వైద్యం అందించడమంటే
  • వైసీపీ పాలనలో ఇది జరగడం లేదు.. ఇది ముమ్మాటికీ వైసీపీ వైఫల్యమే

కార్వేటి నగరం మండలం, గోపిశెట్టి పల్లి పంచాయతీ, ఈదువారి పల్లి గ్రామంలో నివాసముంటున్న కార్తీక్ ను జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జి డా. యుగంధర్ పొన్న పరామర్శించారు. ఇటీవల నరాల బలహీనత వల్ల క్రమేణా కాళ్ళు చేతులు చచ్చు బడి అనారోగ్య బారిన పడిన కార్తీక్ ను ఓదారుస్తూ.. కుటుంబానికి దైర్యం కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్తీక్ కి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. జబ్బు నయమయ్యేఒత వరకు జవాబుదారి ఉండాలని, అదీ వైద్యం అందించడమంటే అని తెలిపారు. వైసీపీ పాలనలో ఇది జరగడం లేదని ఇది ముమ్మాటికీ వైసీపీ వైఫల్యమే అని ఎద్దేవా చేశారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని, జనసేన ప్రభుత్వంలో వైద్యానికి పెద్ద పీట ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్తీక్ కు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు శోభన్ బాబు, నియోజకవర్గం సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్యామ్ ప్రసాద్, వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, ప్రధాన కార్యదర్శి నరసింహ, కార్యదర్శి రూపేష్, బాలాజీ, సంతోష్, సునీల్, విజయ్, ఠాగూర్, మోహన్, హరికృష్ణ వెదురు కుప్పం మండల ప్రధాన కార్యదర్శి సతీష్, పాల్గొన్నారు.