లింగాల పల్లెలో జనసేన ప్రజా పోరాట యాత్ర

  • జనసేన ప్రజా పోరాట యాత్ర వెల్దుర్తి మండలం, లింగాల పల్లె గ్రామంలో పర్యటించిన జనసేన పార్టీ నాయకులు సీజీ రాజశేఖర్

పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండల నాయకులు, పుల్లగుమ్మి పరమేష్, నాయకల్ బాబ్జి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు సిజి రాజశేఖర్ జనసేన ప్రజా పోరాట యాత్ర కొనసాగడం జరిగింది,
జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ, లింగాలపల్లి గ్రామానికి త్రాగునీటి సౌకర్యం లేదు, ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేక ఎమర్జెన్సీ అంబులెన్స్ రావడానికి కూడా ఈ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేని దృశ్యాలు చూసాం, ఈ గ్రామంలో 60 సంవత్సరాలు పైబడిన వారికి కూడా పింఛన్లు రాని దృశ్యం చూసాం, అలాగే భర్త చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నా కానీ, ఒంటరి మహిళ కింద పింఛన్ రావడం లేదు, ఈ గ్రామంలో మొత్తం 78 కుటుంబాలు జీవిస్తున్నారు, ఈ గ్రామానికి ఇప్పటివరకు ఒక ఇల్లు నిర్మాణం కూడా చెప్పట్టలేదు. పూరిగుడిసెల్లో అనేకమంది జీవిస్తున్న దృశ్యాలు చూసాం, త్రాగునీటి నిలువ సింటెక్స్లు పగులపై నీరు వృధా అవుతున్న పట్టించుకోని అధికారులు, త్రాగునీటి సమస్యతో బాధ పడుతున్న గ్రామస్తులు ఆవేదన బాధలు సమస్యలు చూసాం, ఇలా ఒకటి కాదు.. రెండు కాదు అభివృద్ధి ఆమడ దూరంలో లింగాలపల్లె, ఇప్పటికైనా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది, ఈ గ్రామం ప్రజలు సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది, ప్రభుత్వం గానీ ప్రభుత్వ అధికారులైన గాని.. ఇప్పటికైనా ఈ గ్రామం పై ప్రత్యేక దృష్టి పెట్టి లింగంపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని జనసేన పార్టీ తరఫున కోరుచున్నామని రాజశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, పురుషోత్తం, ఎర్రి స్వామి, నాగరాజ్, వడ్డే విరేష్, పులి శేఖర్, రాకేష్, మధు కుమార్, ఖలీల్, మనోహర్, రామ్, మరియు తదితరులు జనసేన ప్రజా పోరాట యాత్రలో పాల్గొన్నారు.