అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం.. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి.. మైలేరి మల్లయ్య

  • వందలాది ఎకరాల్లో పంటలు నష్టం

ఆళ్లగడ్డ: అకాల వర్షాలతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వెంటనే నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన నాయకుడు మైలేరి మల్లయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు మైలేరి మల్లయ్య మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వందలాది ఎకరాలలో మొక్కజొన్న, వరి, బొప్పాయి, మామిడి, నిమ్మ, అరటి పంటలు దెబ్బతిన్నాయన్నారు. నష్టాన్ని వ్యవసాయ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే అంచనా వేసి నష్టపోయిన రైతు కుటుంబాలకు ఎకరాకు రూ.20 వేలు చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద యెత్తున ఆందోళనలకు పునుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాచంశెట్టి వెంకటసుబ్బయ్య, బావికాడి గుర్రప్ప, కుమ్మరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.