హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అరుదైన ఘనత

ముంబై: భారత బ్యాట్స్‌వుమన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆదివారం అరుదైన ఘనత సాధించింది. భారత్‌ తరఫున 100 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన ఐదో భారత మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. సౌతాఫ్రికాతో లక్నో వేదికగా జరిగిన తొలి వన్డేలో ఈ మైలురాయి అందుకుంది.

భారత్‌ తరఫున 100 లేదా అంతకంటే ఎక్కువ వన్డేలు ఆడిన క్రీడాకారిణుల జాబితాలో మిథాలీ రాజ్ (210), జులాన్ గోస్వామి (183), అంజుమ్ చోప్రా (127), అమితా శర్మ (116) ఉన్నారు. భారత వన్డే వైస్ కెప్టెన్ కౌర్‌ 100 మ్యాచ్‌ల్లో 2,412 పరుగులు చేసింది. వన్డేల్లో ఆమె మూడు సెంచరీలు సాధించగా ఆమె అత్యధిక స్కోరు 171.