మహేష్ సరసన ప్రియాంక మోహన్ !

నాని ‘గ్యాంగ్​లీడర్’ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ప్రస్తుతం శర్వానంద్​తో కలిసి ‘శ్రీకారం’ సినిమా చేస్తోంది. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో శివకార్తికేయన్ నటిస్తున్న ‘డాక్టర్​’లోనూ కథానాయికగా చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రియాంకకు అదిరిపోయే ఆఫర్ దక్కిందని తెలుస్తుంది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ వచ్చిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను తెరక్కించిన అనీల్ రావిపూడి మరోసారి మహేష్ ను డైరెక్ట్ చేయాలనీ చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్, పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.