హిందూపురంను జిల్లాగా ప్రకటించాలి..

టిడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్నిరోజులుగా ఆయన హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రైతులు, ఇతర వర్గాల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన నియోజకవర్గం హిందూపురంను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ విషయంలో సీఎం జగన్ ను కలిసి మాట్లాడతానని చెప్పారు. ఆయన ఈ విషయంలో ఇంతకుముందు సీఎం జగన్ కు లేఖ కూడా రాశారు.

ఇక, స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ… హిందూపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని, మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని బాలకృష్ణ ఈ సందర్భంగా ఆరోపించారు. ఇప్పటికే హిందూపురంకు ఐదుగురు మున్సిపల్ కమిషనర్లు మారారని వివరించారు. ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అన్నారు.