విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించాలి జనసేన ఎంపీపీ శ్రీమతి మేడిచర్ల వెంకట సత్యవాణి

రాజోలు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని మలికిపురం ఎంపిపి తెలిపారు. ఈ సందర్భంగా సత్యవాణి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి అని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్ట పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు, ప్రజలు, విద్యార్థులు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని రోజురోజుకీ పెరుగుతున్న కేసులు చూస్తుంటే ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కావున వైసీపీ ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించాలి. తల్లి తండ్రులకు ఇష్టం లేకపోయిన భయం భయంగా తమ బిడ్డలను పాఠశాలలకు పంపిస్తున్నారు హాజరు శాతం తగ్గితే అమ్మా ఒడి పధకం కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రావని పాటశాల సిబ్బందితో చెప్పించడం వలన తల్లితండ్రులు తప్పని పరిస్తతుల్లో తమ బిడ్డలను పాఠశాలలకు పంపిస్తున్నామని వాపోతున్నారు, దీనిపై విద్యాశాఖ మంత్రి వెంటనే ప్రకటన చేయాలని ఆమె కోరారు. తల్లితండ్రులు బిడ్డలను కోల్పోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికీ అయిన వైసీపీ ప్రభుత్వం చిత్తుద్ధితో వ్యాహరించలి లేకపోతే భవిష్యత్తులో జనసేన పార్టీ విద్యార్థి సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని ఆమె ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.