అత్యదిక క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసిన రాము మరియు శివసాయి లకు సన్మాన కార్యక్రమం

పి.గన్నవరం నియోజకవర్గం, మామిడికుదురు మండలంలో అత్యదికంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసిన కొమ్ముల రాము కి మరియు కొమ్ముల శివసాయి కి మామిడికుదురు మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు, లూటుకుర్రు గ్రామ సర్పంచ్ ఆడబాల తాతకాపు, జనసేన పార్టీ నాయకులు విల్ల సుబ్బారావు,లూటుకుర్రు జనసేన పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బొంతు శేఖర్ చేతుల మీదుగా వీరిరువురికీ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, అనంతరం జనసెన క్రియాశీలక సభ్యులకు క్రియాశీలక సభ్యత్వ కిట్ లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మామిడికుదురు మండల జనసేన పార్టీ అధ్యక్షులు జాలెం శ్రీనివాసరాజు, కంకిపాటి నరసింహారావు,ఎంపీటీసీ చేరుకురి పార్వతీ, సత్తిబాబు మరియు మండల కమిటీ సభ్యులు గ్రామకమిటీ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.