వేమూరులో గుర్రం జాషువా జయంతి వేడుకలు

  • కవిత్వంతో మనువాదం మీద యుధ్ధం చేసిన కవి చక్రవర్తి జాషువా

వేమూరు నియోజకవర్గం: వేమూరు మండలం, వరహాపురం జెడ్ పి స్కూల్ నందు హెచ్.ఎం అనుమతితో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 128వ జయంతి కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్దిని, విద్యార్థులు వై దాసు మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్.ఎం మాట్లాడుతూ జాషువా విద్యార్థి దశ నుంచే అంటరాని వానిగా ఎన్నో అవమానాలు పడి విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారని ఆయన కవిత్వంతో మనువాదం మీద యుధ్ధం చేసిన నవయుగ కవి చక్రవర్తి అని కొనియాడారు. తెలుగు ఉపాధ్యాయులు జాషువా గారు రాసిన కవిత్వం సామాన్య ప్రజలకు అర్ధం అయ్యేలా వ్రాశారు అన్నారు. దాసు మాదిగ మాట్లాడుతూ విద్యతో పాటు మహానుభావుల జీవితాలను చదవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.