మానవత్వం చాటిన జనసేన -టిడిపి కార్యకర్తలు

తిరువూరు నియోజకవర్గం: చాట్రాయి మండల జనసేన పార్టీ కార్యకర్త వలసపల్లి రామకృష్ణ మరియు విసన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గునిశెట్టి సత్యం, గుని శెట్టి మణికంఠ బుధవారం రాత్రి బీసీ కాలనీ ఎన్టీఆర్ దిమ్మ దగ్గర ఎక్కడికి వెళ్లాలో తెలియక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నఒక వృద్ధురాలుకి ఆహారం, మంచినీరు అందించి, తమ బంధువులను గుర్తించి వారికి అప్పగించడం జరిగినది. దీనికి సహకరించిన విస్సన్నపేట పోలీసు వారికి ధన్యవాదములు తెలియజేయడం జరిగినది.