యూకె జనసేన ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

యూకె, యూకె జనసేన ఆధ్వర్యంలో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు లండన్, మాంచెస్టర్ మరియు బర్మింగ్ హామ్ నగరాలలో మీతోనే అనే కార్యక్రమం ద్వారా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్న జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు వారి భావాలను పంచుకవటం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధులుగా జనసేన నాయకులు మరియు దర్శకులు అయిన మెహర్ రమేష్, ఎన్నారై ఎస్.ఏ.వి.వి.ఈ కో-ఆర్డినేటర్ శశిధర్ కొలికొండ జూమ్ ద్వారా పాల్గొన్నారు. మరియు జనసేన నాయకులు బొమ్మిడి నాయకర్, సురేష్ నేరెళ్ల, పోతిన మహేష్, సందీప్ పంచకర్ల, ప్రసాద్ చిగిలిశెట్టి విషెస్ వీడియో రికార్డ్స్ ద్వారా పంపి ఉత్తేజ పరిచారు. ఎన్నారై ఎన్నికల యాత్ర అనే కార్యక్రమం ప్రారంభించి 2024 ఎన్నికలకు ఇండియాకి వెళ్లే ఎన్నారైలకి సూచనలు ఇచ్చారు. ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమం ద్వారా పార్టీకి సపోర్ట్ గా నిలవాలి అని చెప్పటం జరిగింది. లండన్ నుండి చంద్ర సిద్ధం, శంకర్ సిద్ధం, నాగరాజు వడ్రాణం, శివకుమార్ మేకా, అమల చలమశెట్టి, పద్మజ రామిశెట్టి, జోజిబాబు గుబిలి, అశోక్ మాజేటి, శ్రీనివాస్ రంకిరెడ్డి, విజయ్ తిరుమలశెట్టి, భాను ఉల్లంకి, రాంకృష్ణ తిరుమలశెట్టి, కళ్యాణ్ వడ్డి, అరుణ్ గంటా, శివ గంటా, బాల నల్లి, అఖిల్ పెండ్యాల, శివ రామిశెట్టి, హేమంత్ కుమార్ మంచాల, మనోజ్ మంత్రాల, నాగేంద్ర సోలంకల, కమల్ మానుకొండ, చలపతి నాయుడు. బర్మింగ్ హాం నుండి అచ్యుతరాజు కూర్మపు, శ్రీవదన వర్జాల, హేమరాజ్ గెల్లి, సందీప్ కుమార్ రెడ్డి కొప్పుల, కోటేష్ కంకిపాటి, మాంచెస్టర్ నుండి సుధీర్ కొట్టె, హరి తోట, వేను, గోపాల్, ప్రవీణ్ పట్టిసపు, సాయి ప్రసాద్ దుబాసి తదితరులు పాల్గొన్నారు.