రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన హుజూర్ నగర్ జనసేన

హుజూర్ నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు జి.సైదులు యాదవ్, ఎస్.కె.హాసన్ మియాల అధ్వర్యంలో లో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అని ఆయన స్పూర్తిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి, అంబేడ్కర్ ఆశయాలను సాధించే విధంగా పోరాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాండారు మహేష్, బానోతు సాయిరాం, బానోతు వినయ్, ఎస్.కె. ఫాయాజ్, శ్రీకాంత్, ఆకాష్ పాల్గొన్నారు.