బాధిత కుటుంబాలను ఆదుకుంటాను: కొవ్వలి రామ్మోహన్

నరసాపురం పట్టణం , పొన్నపల్లిలో అగ్నిప్రమాదంలో నిరాశ్రయులైన బాధితులను మంగళవారం కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు కలిశారు. బాధితులు బస్వాని రాము, రాంబాబు, లక్ష్మి వెంకటేశ్వర్లులను అగ్నిప్రమాదానికి గల కారణాలను, వారి జీవన పరిస్థితులను రామ్మోహన్ నాయుడు అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని, కొవ్వలి ఫౌండేషన్ ద్వారా తనవంతు సాయం అందించి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు వెంట నాయకులు పొన్నాల నాగబాబు, సంకు భాస్కర నాయుడు, రేవు పద్మారావు, మల్లాడి మూర్తి, తిరుమాని గోవిందరావు, నండా రామకృష్ణ, బర్రె మురళీ తదితరులు ఉన్నారు.