జనసేనాని త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇచ్ఛాపురం జనసేన

  • జనసేనాని త్వరగా కోలుకోవాలని 101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కును తీర్చుకున్న జనసైనికులు

ఇచ్ఛాపురం: జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ప్రజా సేవలో నిమగ్నమై ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ఆదివారం ఇచ్ఛాపురం దగ్గరలో వెలసిన మహిమ గల తల్లి తులసమ్మ అమ్మవారి గుడి దగ్గర ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు సమక్షంలో జనసైనికులు 101 కొబ్బరి కాయలు కొట్టి అమ్మవారి మొక్కును తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ ఆయన ప్రజా సేవలో నిమగ్నమవ్వాలని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, జనసేన రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, జన సైనికులు, జనసేన వీర మహిళలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమానికి విచ్చేసిన జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జసైనికులు అందరికీ దాసరి రాజు పత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.