నిమ్మలపాడు మైనింగ్ జోలికి వస్తే తాటతీస్తాం: జనసేన మురళి

అనంతగిరి మండలం వాలసి పంచాయతీ నిమ్మలపాడు, కరకవలస, రాళ్లగరువు గ్రామాలలో కాల్సైట్ మైనింగ్ కోసం మాజీ ఎమ్మెల్యే తాజా ఎస్టి కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు ఏపెండిసి నుండి బినామీల ద్వారా టెండర్ తీసుకొని స్థానిక ప్రజలు మైనింగ్ కు అంగీకరించకపోవడంతో అమాయక గిరిజనులకు లేనిపోని ఆశ చూపించి భూమికి బదులు భూమిని,నష్టపరిహారంగా నగదు రూపంలో ఇస్తామని మాయమాటలు చెప్పి ఇచ్చిన పరిమితులు దాటి అక్రమ మైనింగ్ చేసి గిరిజనుల భూమిని పాడుచేసి వాతావరణాన్ని కాలుష్యం తో నింపి అక్రమంగా సంపాదించిన తర్వాత కనీస నష్టపరిహారం చెల్లించకుండా మోసం చేసిన కుంభ రవిబాబు మరియు అతని బినామీలపై చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి పిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయమై గిరిజన సంఘాలు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, యువత, ప్రజల యొక్క మద్దతు కావాలని స్థానిక గ్రామ ప్రజలు జనసేన తెలియజేసారు.