ప్రభుత్వ కర్మాగారాలు ప్రైవేటీకణ చేస్తుపోతే మా లాంటి యువత ప్రజా ఉద్యమ బాట పడతారు

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాజోలు నియోజక వర్గం మామిడికుదురు మండలం ఇదారడ గ్రామానికి చెందిన గల్లింక బ్రహ్మానందం అనే జనసైనికుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్లకార్దు పట్టుకుని అమలాపురం ఎంపీ శ్రీమతి చింత అనురాధ కి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు, పార్లమెంటు సమావేశాలలో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపేయాలని ఆంధ్రా ప్రజల తరుపున ప్లకార్డు ప్రదర్శన ఎంపీలు అందరూ కలిసి నిర్వహించాలి అని ఆయన డిమాండు చేశారు లేని పక్షమున జనసేన పార్టీ తరపున యువత ఉద్యమాలు చేస్తాము అని అన్నారు.