దిన దిన గండంగా విశాఖ ఉక్కు కర్మాగార కార్మికులు ఉలుకు పలుకు లేని వైసీపీ ప్రభుత్వం

జన సేనాని నిర్ణయమే శిరోధార్యం.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ పేరుతో చేస్తున్న దోపిడీని తక్షణమే ఆపాలి అలాగే ప్రభుత్వ పరమైన బడా కర్మాగారాలు అన్ని ప్రవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంటే రాష్ట్ర ప్రభత్వానికి కనీసం సామాజిక స్పృహ కూడా లేనట్టు ప్రవర్తిస్తుంది, వైసీపీ ప్రభుత్వం తన సొంత ప్రయోజనాల కోసం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కి మద్దతు పలుకుతుంది అని పలు అనుమాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తక్షణమే తమ తప్పుడు విధానాలు ఆపివేయాలని అమలాపురం ఎంపీ శ్రీమతి చింత అనురాధ గారికి తమ నిరసన తెలియ చేస్తూ ప్లకార్డు పట్టుకుని జరిగే పార్లమెంటు సమావేశాలలో మీరు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్లకార్డలతో ఎంపీ లు అందరూ కలిసి ప్రదర్శన నిర్వహించాలి.