పవన్ కళ్యాణ్ మానవత్వంతో మాట్లాడితే నిరసనలా..?

  • వైసిపి నాయకులు రెచ్చగొడితే తడాఖా చూపిస్తాం
  • రాజంపేట జనసేన ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట నియోజకవర్గం: రాజంపేటలో వైసీపీ వాలంటీర్ చర్యలకు నిరసనగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి బుధవారం రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ.. ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థను గురించి మాట్లాడడం జరిగినది కానీ ఈ వైసీపీ వాలంటీర్స్ దాన్ని తప్పుగా అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను దహనం చేయడం పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడటం చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడంలో తప్పేముంది. వాలంటీర్స్ వైకాపా కార్యకర్తలుగా పనిచేయడం నిజం కాదా..? వాలంటీర్స్ ప్రజల సమాచారాన్ని గుప్పెట్లో పెట్టుకొని ప్రజలపై టెర్రరిస్టులు లాగా నిగా పెట్టడం లేదా..? ప్రజల సమాచారాన్ని వైకాపా నాయకులకు అందించడం లేదా..? కొందరు వాలంటీర్స్ దొంగ సంతకాలు పెట్టుకొని ప్రజల ఆస్తులను కొల్లగొట్ట లేదా..? బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోలేదా..? యువతులను మానభంగం చేయలేదా..? అలాగే ఈ వైసీపీ మంత్రి రోజా గారు మంత్రి పదవి తీసుకొని పవన్ పవన్ కళ్యాణ్ ను విమర్శించడంలేదా అని వెంకటరమణ ప్రశ్నించారు.