పుంగనూరులో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం

పుంగనూరు: వైసీపీ పార్టీ మంగళవారం వాలంటీర్లతో కలసి పుంగనూరు టౌన్ నందు పవన్ కళ్యాణ్ బొమ్మ దాహనాన్ని నిరసిస్తూ బుధవారం బుధవారం జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఫోటోకి స్థానిక మూడెప్ప సర్కిల్ లో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాకు వ్యవస్థలపైన ఎప్పుడూ గౌరవం ఉంటుంది, కొంతమంది వాలంటీర్లు ప్రజల కోసం పనిచేయడం మానేసి వైసీపీ కోసం పనిచేస్తున్నారు, అలాంటి అమాయక వాలంటీర్స్ ను రెచ్చ గొట్టి పబ్బం గడుపుకుంటున్న వైసీపీ నాయకులను జనసేన నాయకులు హెచ్చరించి, 2024లో రాబోయేది జనసేన ప్రభుత్వమే వైసీపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని జనసేన నాయకులు హితువు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న రాయల్, రూరల్ ప్రసిడెంట్ విరూపాక్ష, జిల్లా పోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, ఐటీ ఇంచార్జీ దేసాది వికాస్, సీనియర్ నాయకులు పాముల హరీ, జనరల్ సెక్రటరీ హరీ నాయక్, బాలాజీ నాయక్ జనసైనికులు గణేష్, మురళి, వెంకటేష్, రెడ్డి కిషోర్, శివ, తిరుమలేశు, తడితురులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.