కారు లోన్ నువ్వు క్లియర్ చేస్తే బహిరంగ చర్చకు మేము సిద్ధం – జనసేన యువనేతల ఆగ్రహం

తిరుమల శ్రీవారి మాల ధరించి గతంలో తమ జనసేన జెండా పట్టి, అవినీతి సొమ్ము సంపాదించాలనే ఆశతో పాలక పార్టీలో చేరి అన్నదమ్ముల లాంటి జనసేన నేతలపై తప్పుడు ఆరోపణలు చేయడం నీకు తగునా అంటూ వైసీపీ కాపు నేత పసుపులేటి సురేష్ ను ఉద్దేశించి జనసేన యువనేతలు రాజేష్ ఆచారి, చిన్నా రాయల్, రమేష్ నాయుడు, పార్ధు, గుట్టా నాగరాజు రాయల్, హేమంత్, పురుషోత్తమం, సాయి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జనసేన పార్టీలో కొనసాగిన పసుపులేటి సురేష్ అవినీతి చేష్టలను చూసి పిచ్చి పుల్కాగా నామకరణం చేశామని గుర్తు చేశారు. నేడు తమ నాయకుడు కిరణ్ రాయల్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. అవన్నీ అవాస్తవాలని సంబంధించిన పత్రాలను ప్రెస్ క్లబ్ మీడియా ముందు చూపించి స్పష్టం చేశారు. జనసేన నేతల్ని రెండు జెండాలు టిడిపి, జనసేనవి మోస్తున్నారని విమర్శించడం తగదు అన్నారు. ఈ కోణంలో చూస్తే తమ జనసేన జెండా మోసిన ఈ పిచ్చి పుల్కా గాడు నేడు సొమ్ము కోసం అమ్ముడుపోయి పాలక పార్టీ జెండాను మోస్తున్నాడని నిప్పులు చెరిగారు. తాము తమ జనసే నాని ఆశయాలను నిజం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామే గాని కాసులకు అమ్ముడుపోయే వ్యక్తులము కాదని హెచ్చరించారు. కిరణ్ రాయల్ కు సంబంధించిన ఎటువంటి వ్యవహారాలు ఉంటే ఎక్కడికి రమ్మన్నా వస్తామని. కిరణ్ రాయల్ తప్పు చేశాడని నిరూపించ లేకపోతే గుండు కొట్టుకుని గాడిదపై ఊరేగడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.