దమ్ముంటే రాజ్యాంగ బద్ధంగా రాజకీయాలు చేయండి భౌతిక దాడులు కాదు

పొన్నూరు నియోజకవర్గం, పొన్నూరు పట్టణంలో పలువురు జనసేన నాయకులు విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి ప్రజల్లో పెరుగుతున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక భౌతిక దాడులు చేస్తున్న ప్రభుత్వాలను సహించేది లేదని దమ్ముంటే రాజకీయాలు రాజ్యాంగ బద్ధంగా చేయాలి తప్ప రాక్షస రాజకీయం చేయడం సరికాదని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గత రెండు రోజుల క్రితం రెక్కీ నిర్వహించిన దుండగుల గురించి ఇంటిలిజెంట్ వర్గాలు త్వరగా వివరణ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ఈ దాడులను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ కి జెడ్ కేటగిరి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.