మార్పు కావాలంటే జనసేనపార్టీతోనే సాధ్యం

పాడేరు, అల్లూరి సీతారామరాజు గూడెం, కొత్తవీధి మండలం, జనసేనపార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.గంగులయ్య అదేశాల మేరకు పెద్ద అగ్రహారం, చిన్న అగ్రహారం గ్రామాలలో సభ ఏర్పాటు చేసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వివరించి, గ్రామం యొక్క సమస్యలను తెలుసుకొని జనసేన పార్టీ కోసం గ్రామస్థులతో సమావేశమైన గూడెం కొత్తవీధి మండల జనసేనపార్టీ నాయకులు ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతూ మా గ్రామస్తులందరూ జనసేన పార్టీని ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా నమ్ముతున్నామని త్వరలోనే పార్టీలో చేరటానికిబి ఎదురు చూస్తున్నమన్నారు. మార్పు కావాలంటే జనసేనపార్టీతోనే సాధ్యమని యువత స్పందించడం కొసమెరుపు. అలాగే గ్రామయువత మాట్లాడుతూ సభ్యత్వం కోసం ఒకరోజుని కేటాయించి తమ గ్రామానికి జనాసేన పార్టీ నాయకులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నమన్నారు. మండల నాయకులు మాట్లాడుతూ తప్పకుండా మీతో మరో మారు సమావేశమవుతామని విషయం అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.గంగులయ్యకి తెలియజేస్తామని త్వరలో ఆయన మీతో కలుస్తారని ఈ సందర్బంగా మీకు తెలియజేస్తున్నామన్నారు. ఈ గ్రామ పర్యటనలో బత్తుల సిద్దార్ధ్ మార్క్, కొయ్యం బాలరాజు, కె గౌతమ్, సీనియర్ నాయకులు గడుతురి పరమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.