రాజంపేట జనసేన ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు

  • ఇఫ్తార్ విందులో పాల్గొన్న జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

రాజంపేట: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ సహకారంతో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో ఉపవాసంతో ఉండే ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రంజాన్ పండుగను ముస్లింలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు.