క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు జనసేన ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానం

  • క్రీడలు ఆయుష్షును పెంచుతుంది
  • మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తుంది
  • ఆరోగ్యవంతమైన వ్యక్తులుగా తీర్చి దిద్దుతుంది
  • ఉల్లాసవంతమైన వ్యక్తులుగా రూపొందిస్తుంది
  • గౌరవంతమైన వ్యక్తులుగా తయారు చేస్తుంది
  • ఆనందదాయకమైన జీవితాన్నిస్తుంది

గంగాధర నెల్లూరు: ఎస్ఆర్ పురం మండలం, వెంకటాపురం గ్రామంలో రాయల్ వికెపి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో విజేతగా నిలచిన రాయల్ వికేపి జట్టుకు ప్రధమ బహుమతిగా జనసేన ఆధ్వర్యంలో 15000 రూపాయలను గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి డా. యుగంధర్ పొన్న అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎస్ఆర్ పురం మండలం సీనియర్ నాయకులు బుల్లెట్ శీను, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటి నగర్ మండల ఉపాధ్యక్షులు విజయ్, జనసైనికులు పాల్గొన్నారు.