తిరుపతి జనసేన నాయకుల అక్రమ అరెస్టు

*న్యాయ పోరాటం చేస్తున్న ఎఫ్.ఎన్.ఓ, ఎం.ఎన్.ఓ కార్మికులను వారికి మద్దతు తెలిపిన జనసేన నాయకులను అన్యాయంగా అరెస్టు చేసిన పోలీసులు

తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆదేశాల మేరకు సోమవారం గత కొద్ది రోజులుగా ఉద్యోగాల నుంచి తొలగించిన ఎఫ్.ఎన్.ఓ, ఎం.ఎన్.ఓ కార్మికులు మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పించండి మా కుటుంబాలని ఆదుకోండి అని న్యాయపోరాటం చేస్తున్న తరుణంలో సోమవారం వారికి మద్దతు తెలిపి, నిరసనలో పాల్గొన్న జనసేన నాయకులు పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, మరియు రాజేష్ యాదవ్, బాబ్జి, హేమకుమార్, అమృత, కీర్తన, మునస్వామి, సాయిదేవ్ లను దౌర్జన్యంగా అరెస్టు చేసి అధికార పార్టీ యొక్క నిజస్వరూపం మరొక్కసారి నిరూపించుకోవడం జరిగింది, ఇలాంటి అరెస్టు చేయడం చాలా బాధాకరం వెంటనే మా నాయకులను కార్మికులను రిలీజ్ చేయాలి. న్యాయపరమైన పోరాటం చేస్తున్న వారిని ఉద్యోగాల్లోకి తిరిగి తీసుకోవాలి లేనట్లయితే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దానికి సిద్ధంగా ఉన్నామని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ తెలిపారు.