జనసేన పార్టీ ‘నా సేన కోసం నా వంతు’ పోస్టర్ ఆవిష్కరణ

మాడుగుల నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం చీడికాడలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “నా సేన కోసం నా వంతు” అను కార్యక్రమాన్ని నియోజకవర్గంలో విస్తృతం చేయడం కోసం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. పార్టీ ప్రారంభం నుంచి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన యొక్క సొంత డబ్బుతో పార్టీని బలోపేతం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు ఈమధ్య చేపట్టిన రైతు భరోసా కార్యక్రమంను తన యొక్క సొంత నిధులతో చేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసైనికుడిని భాగస్వామ్యం చేస్తూ పార్టీ బలోపేతానికి మరియు పార్టీ చేపట్టిన సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని పార్టీనీ ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాలుగు మండలాల జనసేన నాయకులు నరియు జనసైనికులు పాల్గొన్నారు.