అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి: అమలాపురం జనసేన

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసారు. తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, నియమనిబంధనల పేరుతో కాలయాపన చేయడం ద్వారా రైతు మరింత నష్టపోయే అవకాశం ఉందని, కావున తక్షణమే తడిసిన లేదా మొలకలు వచ్చిన లేదా తడిసి ఆరబెట్టిన ఏ రకమైన ధాన్యం అయినా తక్షణమే ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో కొనుగోలు చేయాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నుంచి ధాన్యాన్ని అఫ్ లైన్ లోనే కొంటున్నామని కలెక్టర్ తెలియజేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులు కేవలం మొలకలు వచ్చిన ధాన్యం మాత్రమే కొంటున్నారని, కాని అన్ని విధాల తడిసిన లేదా పాడైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ కు జనసేన పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. దానిపై కలెక్టర్ స్పందించి తక్షణమే కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, జనసేన పార్టీ నాయకులు మహాదశ నాగేశ్వరరావు, సందాడి శ్రీనుబాబు, పేరూరు ఎంపిటిసి పనసా బుజ్జీ, సుధా చిన్న, మోకా బాలయోగి, కుంపట్ల వెంకట రమేష్, పొనకల ప్రకాష్, ఆకెటి వెంకన్న, గోలకోట వెంకటేష్, పినిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.