పదవ తరగతి ఉత్తీర్ణులను అభినందించిన రాజోలు జనసేన నాయకులు

రాజోలు, రాజోలు మండల పరిధిలోని రాజోలు జడ్పీ పాఠశాలకు చెందిన పదవ తరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన మొల్లేటి జస్వంత్ సూర్య శ్రీనివాస్ ని సోమవారం రాజోలు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు ఇంటిపల్లి ఆనందరాజు ఇంటికి వెళ్లి విద్యార్థులని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజుతో పాటు జనసేన నాయకులు పిప్పళ్ళ లక్ష్మణరావు, యెరుబండి చిన్ని పాల్గొన్నారు.