అంగన్వాడీ ఉద్యోగుల దీక్షకు సంఘీభావం తెలిపిన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు రేణిగుంట మండల అంగన్వాడీ ఉద్యోగుల దీక్షకు శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా సంఘీభావం తెలియజేయడం జరిగింది. గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు న్యాయ బద్దంగా కోరుతున్న డిమాండ్ లు పరిష్కరించాలని చేస్తున్న దీక్షలో భాగంగా రేణిగుంట పట్టణంలో రేణిగుంట, ఏర్పేడు మండల అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి శనివారం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాదయాత్రలో నా అక్క చెల్లెమ్మలు అని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది నిరసన చేస్తుంటే పట్టించుకోకుండా జగన్ ఉండడం బాధాకరం అన్నారు, కనీస వేతనం 26 వేలు చెల్లించాలన్న డిమాండ్, గ్రాట్యుటీ, పెన్షన్ డిమాండ్ లు అమలు చెయ్యాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం అమలు చెయ్యకపోవడం బాధాకరం అన్నారు. 3 నెలలు దాటాక జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో అంగన్వాడీ డిమాండ్ లు తప్పక పరిష్కరిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ పనులను సచివాలయం ఉద్యోగుల చేత చేయించడం సిగ్గుచేటు అని, రేపు మునిసిపాలిటీ వర్కర్లు నిరసన చేస్తే సచివాలయ ఉద్యోగుల దగ్గర డ్రైనేజ్ కాలువలు కడిగిస్తారా అని ఎద్దేవా చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు పూర్తి మద్దతు జనసేన నుండి ఉంటుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీ ఉద్యోగుల న్యాయబద్దంగా కోరే ప్రతి డిమాండ్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గ పర్యటనకి వచ్చినపుడు సమస్య తెలిపుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేణిగుంట పట్టణ ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, పార్థ సారథి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, నాయకులు రవి కుమార్ రెడ్డి, త్యాగరాజు, జ్యోతి కుమార్, నగరం భాస్కర బాబు, మాజీ ఎంపీటీసీ జయలలిత, నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.