మలికిపురంలో జనసేన-తెలుగుదేశం పార్టీల గ్రామ గ్రామాన గ్రామస్థాయి సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం మలికిపురం గ్రామంలో శనివారం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు ఇంటివద్ద మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, గ్రామశాఖ ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన- తెలుగుదేశం పార్టీల గ్రామస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన-టిడిపి సమన్వయ బాద్యులు గుండుబోగుల పెద్దకాపు, టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి సూర్యారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, జిల్లా కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, జిల్లా సంయుక్త కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, టీడీపీ మండల అధ్యక్షులు అడబాల యుగేందర్, జనసేన ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మండల నాయకులు, గ్రామ నాయకులు, వీర మహిళలు, జనసేన-టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.