తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో… శర్వానంద్‌ 30వ చిత్రం

శర్వానంద్‌ హీరోగా ‘ఖైదీ’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఎస్‌.ఆర్‌. ప్రభు ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకార్తీక్‌ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ సినిమా శర్వానంద్‌ కెరీర్‌లో 30వ చిత్రం కావడం విశేషం. ఇందులో రీతూ వర్మ కథానాయిక. అమల అక్కినేని ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రాన్ని రూపొందించామని శ్రీకార్తీక్‌ అన్నారు. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచమవుతున్నారు. తరుణ్‌ భాస్కర్‌ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి జేమ్స్‌ బిజోయ్‌ సంగీత దర్శకుడు.

”ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. కుటుంబ ప్రేక్షకుల్లో శర్వానంద్‌కు అమితమైన ఫాలోయింగ్‌ ఉంది. అయితే ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులనే కాకుండా అటు యూత్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని రూపొందించాం. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.