రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు

పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో 11వ వార్డు అంబేడ్కర్ కాలనీ వద్ద గల అంగన్వాడీ కేంద్రం వద్ద పిల్లలుకు త్రాగు నీరు, కనీసం చేతుల కడుక్కోటానికి లేక అవస్థలు పడుతున్న విషయం గమనించిన కన్నబత్తుల సుగుణ కుమారి 11వ వార్డ్ మెంబర్ వాటర్ ట్యాంక్ తాను సొంత ఖర్చులతో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది. కానీ అది జీర్ణించుకోలేక దురుద్ధేశంతో పంచాయతీ అధికారులు, అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేసి ఆ వాటర్ ట్యాంక్ కి కనెక్షన్ ని తొలగించేలా చేయటం జరిగింది. అది తెలుసుకున్న ఆ ప్రాంతంలోని మహిళలు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయటానికా లేక ఇటువంటి కక్ష పూరిత చర్యలు చేయటానికా..? అని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పెద్ద ఎత్తున మహిళలు, వార్డ్ మెంబెర్ లు కె జీవరత్నం, జయబాబు, పుత్రయ్య, జనసేన నాయకులు పిల్లా దినేష్, వి సూర్య ప్రకాష్, రామ్, గాంధి మరియు ప్రజలు పాల్గొన్నారు.