కళ్యాణదుర్గం పట్టణంలో జనంలోకి జనసేన

కళ్యాణదుర్గం పట్టణం, కోటవీధిలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ విధివిధానాలను ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి పాంప్లెట్లు ఇచ్చి వివరించడం జరిగింది. అదేవిధంగా స్థానిక కాలనీవాసులతో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడం జరిగింది. కాలనీలో కొంతమందికి పెన్షన్లు తీసివేయడం జరిగిందని జనసేన దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రజల్లో రోజురోజుకీ జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతుంది. కోటవీధిలో దాదాపు 70% ప్రజలు జనసేన పార్టీకి మద్దతుగా ఉంటామని తెలియజేశారు. స్థానికంగా కోటలో నివాసం ఉండే జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ రాఘవేంద్ర కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు రమేష్ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు యువత పార్టీ కోసం పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు రమేష్, ఐటి కోఆర్డినేటర్ రాఘవేంద్ర, జనసేన వీరమహిళ షేక్ తార, బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు ఆంజనేయులు, వంశీకృష్ణ, ముక్కన్న, మహేష్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.