ఆరని శ్రీనివాసులుని మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థులు

తిరుపతి ఉమ్మడి పార్టీల కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులుని, వెటర్నరీ యూనివర్సిటీ మరియు వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు కలవడం జరిగింది. తమ సమస్యలను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినాకే తీరుతాయి అని విద్యార్థులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మాకు యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు లేవు నీళ్ల సౌకర్యము లేదు, మెస్సుల్లో భోజనాలు సమంగా లేవు అని విద్యార్థులు తెలుపుడం జరిగింది. తిరుపతికి కాబోయే ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు విద్యార్థులకు పవన్ కళ్యాణ్ నేను అందుబాటులో ఉంటాను మీ సమస్యలు తీరుస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. మీరు అందురు కలిసి తిరుపతిలో జనసేన ఎమ్మెల్యేను గెలిపించాలని కోరడం జరిగింది.