58వ డివిజన్ జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభం

  • “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” రూపొందించిన “జనంలోకి జనసేన” కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ

విజయవాడ, జనసేన పార్టీ 58వ డివిజన్ అధ్యక్షులు రెహమాన్, ఉపాధ్యక్షులు నరేంద్ర, సురేష్, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, విజయలక్ష్మి, నగర కార్యదర్శి పాల రజినిల ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభం ముఖ్య అతిథిలుగా విచ్చేసిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మరియు రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసుల చేతుల మీదుగా అత్యంత ఘనంగా జరిగింది. పార్టీ కార్యాలయ ప్రారంభం అనంతరం “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” టీమ్ సభ్యులు, యూకేకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు జోజి గుబిలి ఆధ్వర్యంలో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ రూపొందించిన “జనంలోకి జనసేన” కార్యక్రమ పోస్టర్ ను జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మరియు రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసుల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ జనసేన నాయకులు బొలిశెట్టి వంశీ కృష్ణతో పాటు నగర్ ఉపాధ్యక్షులు కామెళ్ళ సోమనాధం, నగర ప్రధాన కార్యదర్శి దాకమర్రి నాగేష్, కృష్ణా పెన్నా రీజినల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య పలు డివిజన్ అధ్యక్షులు58వ డివిజన్ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.