గణపవరంలో ఘనంగా జనసేన జండా దిమ్మల ఆవిష్కరణ

ఉమ్మడి గుంటూరు: చిలకలూరిపేట నియోజకవర్గంలో జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో గణపవరం గ్రామంలో 5 వార్డులలో స్థానిక పార్టీ నాయకులతో కలిసి నూతన జండా దిమ్మలను ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు, అడపా మాణిక్యాలరావు, ఇస్మాయిల్ బెగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా నియోజవర్గ నాయకులు డప్పులతో బాణాసంచాలతో ఘన స్వాగతం పలికి నాయకులను ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన 5 జెండాలను ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం నియోజకవర్గ నాయకులు ఏర్పాటు చేసిన మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సనదర్భంగా గాదె మాట్లాడుతూ.. ఈ రోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో మా పార్టీ కమిటీ సభ్యులు రాజా రమేష్, సుభాని మరియు నియోజకవర్గ నాయకులు మండల అధ్యక్షులు అందరూ కలిసి ఈ విధమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషమని ముందుగా వారిని అభినందిస్తున్నానని తెలిపారు. వైసిపి ప్రభుత్వం చేపట్టిన సామాజిక బస్సుయాత్రను రాష్ట్ర ప్రజలు బహిష్కరిస్తున్నారని వారు చేస్తున్న విజయ యాత్ర అది అసంపూర్ణంగా ఉన్న యాత్ర కాబట్టి ప్రజలు గమనించి వారికి తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలలో మనము టిడిపి పార్టీ వారితో కలసి ప్రయాణం చేస్తున్నాము కాబట్టి మీరు అందరు కూడా మాకు రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి ఏ విధమైన సలహాలు సూచనలు ఇస్తారో అదే జిల్లా అధ్యక్షులుగా జిల్లా పార్టీ కార్యాలయం నుంచి మన జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి మేము అదే సందేశాన్ని మీ అందరికీ పంపిస్తాము మీరు కూడా మీ నియోజకవర్గాల్లో ఉన్న టౌన్ నాయకులకు గాని మండల కమిటీ సభ్యులు కానీ గ్రామ కమిటీ సభ్యులు గానీ తెలియజేసి పార్టీ లైన్ ని ఎవరు అతిక్రమించకుండా ఉండేవిధంగా చూసుకోవాలని మీ నియోజకవర్గంలో, మండలాలో కానీ టిడిపితో కలసి ఎలాంటి కార్యక్రమం ఐనా మీరు ముందు జిల్లా కార్యాలయంలో తెలిపి తరువాత మేము చెప్పే విధంగా అది పార్టీ లైన్ దాటకుండా అందరూ నడుచుకోవాలి అని ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు తెలిపారు. ఆమంచి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన నీ అంతమందించాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు రానున్న ఎన్నికల్లో టిడిపి తో కలిసి వైసిపిని గద్దించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బడే కోమలి, బందనాల జ్యోతి, అనురాధ, నిశంకర శ్రీనివాసరావు, సుభాని, చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు పటాన్ ఖాదర్ బాషా, లీలా కిషోర్, గాలి రాజా, తోటకూర రమేష్, తులం శ్రీను, పసుపులేటి సాయి, వీర మహిళలు కోటేశ్వరమ్మ, సుమలత, ప్రసన్నలక్ష్మి మరియు జనసేనకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.