రైతు సమస్యలపై కలెక్టరుకు వినతిపత్రమిచ్చిన శ్రీమతి కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, లావేరు గ్రామపంచాయతీ నుంచి రైతులు మరియు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళి వినతపత్రం ఇవ్వడం జరిగింది. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా మొక్కజొన్న మరియు ప్రతి ఇతర పంటలు పూర్తిగా నాశనం అయిపోయాయని మొక్కజొన్న ఎకరానికి పాతిక నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడి అవ్వగా పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వివరించారు‌‌. ఈ విషయంపై తగు చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ రైతులకు చెప్పడం జరిగింది. ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు కాంతిశ్రీ మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేలా చూడాలని కలెక్టర్ కి చెప్పడం జరిగిందని దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.