శింగవరం గ్రామంలో జనంలోకి జనసేన

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం శింగవరం గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జనసేన పార్టీ సిద్ధాంతాలు జనసేనపార్టీ నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం (పి.వి.ఆర్) ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల వైస్ ప్రెసిడెంట్లు వాకా ఇంద్రా గౌడ్, మేడా పూర్ణ చంద్రరావు, మండల ప్రధాన కార్యదర్శి గోపి, నిడదవోలు పట్టణ నాయకులు రంగా రమేష్, షబ్బీర్, పవన్, నియోజకవర్గ ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు మూర్తి, మరియు నార్ని తాతాజీ, కస్తూరి సుబ్బారావు, సత్యనారాయణ, నిడదవోలు వీరమహిళలు, జనసేన కార్యకర్తలు, జనసైనికులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శింగవరం గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు ముందుండి నడిపించడం జరిగింది.