టార్గెట్ బాల్ నేషనల్ పెడరేషన్ కప్ విజేతలను అభినందించిన వంపురు గంగులయ్య

పాడేరు జోన్: ఉత్తర ప్రదేశ్ లో 22.4.2022 తేదీన జరిగినటువంటి 6వ టార్గెట్ బాల్ నేషనల్ పెడరేషన్ కప్ విభాగంలో ఆంధ్రప్రదేశ్, ఆంధ్రాయూనివర్సిటీ నుంచి టార్గెట్ బాల్ టీమ్ లో సెలక్ట్ అయిన విద్యార్థులు వెంటనే కప్ కూడా సాధించారు. ఈ టార్గెట్ బాల్ జట్టులో అల్లూరి జిల్లా మన్యం ట్రైబల్ విద్యార్థులు నిక్కుల విద్య కళ్యాణ్ (తండ్రి సింహాచలం), కిల్లో గోపాల్ (తండ్రి డొంబన్న) విద్యార్థులు కూడా తమ ప్రతిభతో సత్తా చాటారు.
ఈ సందర్భంగా.. అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జి వంపురు గంగులయ్య మాట్లాడుతూ.. నిక్కుల విధ్యకళ్యాన్, కిల్లో గోపాల్ స్వతహాగా జనసైనికులు కావడం అందులో ఉత్తరప్రదేశ్ లో జరిగిన నేషనల్ టార్గెట్ బాల్ 6వ పెడరేషన్ కప్ లో విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని, జీవితంలో మరీన్ని విజయాలు సాధించి ట్రైబల్ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని, మీరు ఈ స్థాయికి రావడానికి ఎంతోగానో కృషి చేసిన మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు రావాలని జనసేన పార్టీ, జనసైనికుల తరుపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, యువత తమ కలలు సాకారం చేసుకోవడానికి అకుంఠితదీక్ష, పట్టుదల, ఏకాగ్రత ఎంతో అవసరమని, మారుతున్న ప్రపంచీకరణలో యువత ఆలోచన శక్తి కూడా భిన్నంగా ఉండాలని, సమాజ శ్రేయస్సు కోసం యువత తమ భుజస్కంధాలపై ఆ బాధ్యత మోయలని జనసైనికులకు, విద్యార్థులకు బావి పౌరులకు ఇదే మా సందేశమని చెప్తూ.. టార్గెట్ బాల్ టీమ్ కోచ్ సురేష్ కు అభినందనలు తెలియ జేశారు.