అంగ రంగ వైభవంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

  • పార్టీకి వెన్నెముక అయిన జనసైనికుల చేతుల మీదుగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని పట్టణంలోని నాయుడు బిల్డింగ్స్, గోపాలవనం నందు నాలుగు అంతస్తుల భవనంలో అంగరంగ వైభవంగా నియోజకవర్గ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు పార్టీ కి వెన్నెముక అయిన 6 మంది జనసైనికుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. జనసైనికుల చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభించడం పార్టీలో వారికి ఇచ్చే గౌరవంగా భావిస్తున్నట్టు వినుత తెలిపారు. ప్రారంభోత్సవంలో రిబ్బన్ కట్ చేసిన జనసైనికులు శ్రీ వెంకట రమణ యాదవ్, శ్రీ ముడుసు గణేష్, షేక్ మున్ని, శ్రీ పెరత్తూరు తులసీ రామ్, మూర్తి గారి గురవయ్య, మారయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం 4 మండలాల నుండి వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.