నాగేంద్రబాబును మర్యాదపూర్వకంగా కలసిన తేజ పోలిశెట్టి

హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగేంద్రబాబును తేజ పోలిశెట్టి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. ఒక సామాన్య కార్యకర్త యొక్క రాజకీయ ఆలోచనా విధానాలు కూడా పంచుకునే అవకాశం తేజ పోలిశెట్టికి నాగేంద్రబాబు ఇచ్చారు.. చదువుకున్న యువత రాజకీయాల్లో కూడా ఉండాలని.. జనసేన పార్టీ ద్వారా వారికి రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు కలిగించి ప్రజల మెచ్చే యువ రాజకీయ నాయకుల్లాగా మిమ్మల్ని చూడాలని నాగేంద్రబాబు చెప్పి.. తేజలో రెట్టింపు ఆత్మవిశ్వాసం పెంపొందించారు.