కొయ్యలగూడెంలో ఘనంగా వంగవీటి రంగా విగ్రహా ఆవిష్కరణ

పోలవరం: కొయ్యలగూడెంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణకు కాపు సేవా సంఘం ఆహ్వానంతో ముఖ్య అతిథులుగా వంగవీటి రాధాకృష్ణ, ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు, గుమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, గుమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, మాగంటి బాబు, పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు హాజరయ్యారు. నాయకులు, జనసైనికులతో భారీ ర్యాలీగా వెళ్లి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. రంగా గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరికీ సాయపడాలని, కష్టం వస్తే ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ముందు గుద్దుకి కొదమ సింహం రంగా గారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏడు మండలాల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, అభిమానులు, జనసేన కార్యకర్తలు నాయకులు భారీగా పాల్గొన్నారు.