పిడుగురాళ్ల జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

గురజాల నియోజకవర్గం: దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందించాలని లక్షలాది మంది ప్రజలు ప్రాణత్యాగాలు చేశారని, వారందరినీ మనం స్మరించుకోవాలని, జనసేన మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ అన్నారు. పిడుగురాళ్ల జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరించి 77వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అహింస మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కులు అంబేద్కర్ కల్పించారని జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల ఖాసిం షైదా అన్నారు. సౌత్యంత్ర ఫలాలు అందరికి అందాలనేది జనసేనాని లక్ష్యమని దానికి అనుగుణంగానే జనసేన శ్రేణులు పనిచేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి కాసిం సైదా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు, షేక్ మదీనా, కార్యదర్శి బేతంచర్ల నాగేశ్వరరావు, నాయకులు బేతంచర్ల ప్రసాద్, కొండా మేస్త్రి, కంభంపాటి ముక్కంటి, వర్ల అభి, జర్సి, పవన్ కళ్యాణ్, ధయ, కామిశెట్టి చిన్న నరసయ్య, పెద్ద నరసయ్య, కిషోర్, ఉదయ్, గపూర్ మొదలగు వారు పాల్గొన్నారు.