విశ్వమానవ కళ్యాణానికి భారత్ ఆలంబన కావాలి

• భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి మన రాజ్యాంగమే మూలమని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26
మనందరికీ ఎంతో పుణ్యదినం. భారతావని సర్వసత్తాక సార్వభౌమ దేశంగా ఆవిర్భవించిన ఈ శుభ తరుణాన్ని పురస్కరించుకుని భారతీయులు అందరికీ నా తరఫున, జనసేన పార్టీ తరఫున 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మన దేశం చిరంతనమైన, పటిష్టమైన, సుసంపన్నమైన గణతంత్ర రాజ్యంగా శోభిల్లడానికి రాజ్యాంగం ద్వారా ప్రాణ
ప్రతిష్ఠగావించిన రాజ్యాంగ రూపకల్పన సారధి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, రాజ్యాంగ పరిషత్ సభ్యులకూ ఈ సందర్భంగా ప్రణామాలు అర్పిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాతలు దేశ ప్రజలకు అందించిన సమన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం, మత స్వేచ్చ అప్రహతిహతంగా వర్థిల్లాని… విశ్వశాంతికి, విశ్వమానవ సౌబ్రాతృత్వానికి, విశ్వ కళ్యాణానికి భారతదేశం ఆలంబన కావాలని మనసారా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.