కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న భారత మహిళల క్రికెటర్లు

ముంబై: ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లే భారత మహిళా క్రికెటర్లు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. పలువురు విమెన్స్‌ క్రికెటర్లు తాజాగా ముంబైలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసును వేసుకున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా రెండో డోసును యూకేలోనే తీసుకోనున్నారు. ప్రస్తుతం టీమ్‌ఇండియా మహిళ జట్టు్ ముంబైలోని క్వారంటైన్‌లో ఉంది.ఇంగ్లాండ్‌ పర్యటనలో ఆతిథ్య జట్టుతో విమెన్స్‌ టీమ్‌ జూన్‌ 16 నుంచి ఏకైక టెస్టులో తలపడనుంది. ఆ తర్వాత రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడతుంది.

‘మహిళల జట్టు ప్లేయర్లు అందరూ వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నారు. చాలా మంది తాము ఉంటున్న నగరాల్లోనే తొలి డోసు వేసుకున్నారు. మరికొంతమంది గురువారం మొదటి డోసు తీసుకున్నారని’ బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.