కాకినాడ సిటీ జనసేన ఆధ్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

కాకినాడ సిటీ, జగనన్న ఇల్లు – పేదలకు కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ సిటీ ఇంఛార్జి మరియు పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, నగర అధ్యక్షులు అశోక్ సంగిశెట్టి మరియు కాకినాడ సిటీ ఐటీ కో ఆర్డినేటర్ మరియు పార్టీ శ్రేణులతో కలిసి కొమర గిరి జగనన్న కాలనీలో పర్యటించి జరుగుతున్న అక్రమాలను పత్రికాముఖంగా ప్రశ్నించడం జరిగింది.