భీమ్లా నాయక్ చిత్రం పై ఆంక్షలు జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం

*మూర్ఖుడు గడియారంలో ముల్లు కదలనీయకుంటే ధరగమనం మొత్తం తలకిందులు అయిపోతుందా?

పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక, ఆర్థికంగా దెబ్బ తీయాలనే ఉద్దేశంతో భీమ్లా నాయక్ సినిమాపై ఆంక్షలు పెట్టడం వైసీపీ ప్రభుత్వం మూర్ఖపు రాజకీయాలకు అద్దం పడుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు. చిత్ర పరిశ్రమ పై ఎందరో కళాకారులు,అనేకమంది కార్మికులు, వారి కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తి కోసం వ్యవస్థను నిర్వీర్యం చేయాలనుకోవడం అవగాహనారాహిత్యం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలతో ఆదరిస్తుంటే, వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించటం దుర్మార్గం. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. లేకుంటే రాబోయే రోజుల్లో పవన్ అభిమానులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట అన్నారు.