మన ప్రాంతం, జనసేన పార్టీ మరియు కూటమి ప్రయోజనాలే మాకు ప్రాధాన్యం

  • జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ బాబు పాలూరు

బొబ్బిలి, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాలలో మా జనసేన పార్టీ ప్రయాణాన్ని, మా జనసైనికుల పనితీరుని శంకిస్తూ ఎవరో కొంతమంది రాజకీయ బ్రోకర్లు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ శనివారం బొబ్బిలి జనసైనికుల నిలయం వద్ద జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, బొబ్బిలి నియోజకవర్గం మండల అధ్యక్షులు మరియు నాయకత్వం అంతా కలసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ తరపున మా‌ ఇన్నేళ్ల కష్టాన్ని ఎవరో స్వార్థపరులు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం జనసేన పార్టీ మరియు కూటమి మనుగడకు దెబ్బ వాటిల్లేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని, గుండెల నిండా జనసేన జెండాని నింపుకుని ఎగసిపడే కెరటాలలా పని చేస్తూ, ఓవైపు సేవా కార్యక్రమాలు మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న మా జనసేన నాయకులు, జనసైనికులు వీరమహిళల చిత్తశుద్ధిని శంఖిస్తే మా జనసేన మరియు కూటమి నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కుయ్యక్తులు పన్నినా మా జనసేన పార్టీని బొబ్బిలి మరియు మా ఈ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాలలో జనసేన పార్టీని చాలా బలంగా నిర్మాణం చేస్తూనే మా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను నెరవేరుస్తామని తెలియజేసారు. మా జనసేన పార్టీ అధిష్టానంకి ఇక్కడి రాజకీయ పరిణామాలన్నిటినీ ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని, పార్టీ నుంచి రాబోయే సూచనలు మేరకు మళ్లీ మీడియా ముఖంగా మరింత స్పష్టంగా కూటమి ఆశయాలకు దెబ్బ వాటిల్లేలా జరుగుతున్న ఇక్కడి రాజకీయ కుట్రలు గురుంచి తెలియజేస్తామని అన్నారు.