కేవీ పల్లి మండల జనసేన పార్టీ అంతర్గత సమావేశం

పీలేరు: కేవీ పల్లిలోని మిన్నంరెడ్డి గారి పల్లిలో మండల అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యం ఆదివారం జనసేన పార్టీ కమీటీ అంతర్గత సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పీలేరు నియోజకవర్గ ఇంచార్జి బెజవాడ దినేష్ మరియు జిల్లా కార్యదర్శి కే రవి పాల్గొన్నారు. బెజవాడ దినేష్ మాట్లాడుతూ రానున్నది జనసేన టీడీపీ ప్రభుత్వమే కావున ఈ అయిదు నెలలు ఎవరికీ భయపడకుండా కస్టపడి పని చేసి నిరంకుశ నియంత పాలనను అంతమొందించి సుస్థిరపాలనను అందిచవలసినదిగా కోరుకుంటూ, పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ ఇచ్చినా కస్టపడి పనిచేసి ఉమ్మడి అభ్యర్థి గెలిపంచవల్సినదిగా కోరుకోవడం జరిగింది. సమావేశంలో భాగంగా కేవీ పల్లి మండలంలో జనసేన టీడీపీ సమన్వయ కమిటిని నియమించుటకు కసరత్తులు జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *